వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కమాండర్ ఇంటికే కన్నమేసి 30 లక్షల బంగారం చోరీ ... చోరీ చేసింది ఎవరో తెలిసి కమాండర్ షాక్

|
Google Oneindia TeluguNews

నాగార్జున యూనివర్సిటీ లోని పదవ ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ కు కమాండర్ గా పనిచేస్తున్న సంతోష్ కుమార్ ఇంట్లో ఓ దొంగ చోరీకి పాల్పడ్డాడు. సంతోష్ కుటుంబానికి చెందిన 30 లక్షల రూపాయల బంగారు ఆభరణాలు దొంగిలించాడు. అయితే ఈ కేసును మంగళగిరి పోలీసులు రెండు గంటల్లోనే ఛేదించారు. అసలు కమాండర్ సంతోష్ కుమార్ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ఎవరు అనేది తెలిస్తే మాత్రం అందరూ కచ్చితంగా షాక్ అవుతారు.

కమాండర్ ను నమ్మించిన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్

కమాండర్ ను నమ్మించిన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్

ఇక అసలు విషయానికి వస్తే మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కునుకు శ్రీనివాస రావు ఎన్డీఆర్ఎఫ్ లోని కమాండెంట్ కార్యాలయం వద్ద డిప్యుటేషన్ మీద పని చేస్తున్నాడు. ఏడేళ్లుగా కుటుంబ సభ్యుడిగా మెలిగిన శ్రీనివాసరావును కమాండర్ సంతోష్ కుమార్ ఎంతగానో నమ్మాడు. ఇంటి మనిషి లాగా మెలగడంతో తన ఇంటి తాళం చెవుల్లో ఒకటి అతనికి ఇచ్చారు. ఇక ఇటీవల జమ్మూకాశ్మీర్ కు కమాండెంట్, శ్రీకాకుళం జిల్లాకు కానిస్టేబుల్ బదిలీ అయ్యారు.

 బదిలీ అయినా వెళ్ళకుండా కమాండర్ ఇంట్లో ఉన్న శ్రీనివాసరావు

బదిలీ అయినా వెళ్ళకుండా కమాండర్ ఇంట్లో ఉన్న శ్రీనివాసరావు


అయితే సంతోష్ కుమార్ జమ్మూ కాశ్మీర్ కు వెళ్లే వరకు ఆయనతోనే ఉంటానని, ఆ తర్వాత శ్రీకాకుళం వెళతానని కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఆయనకు విజ్ఞప్తి చేశాడు. కాస్త సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నట్లు గా కూడా బిల్డప్ ఇచ్చాడు.

అది నమ్మిన సంతోష్ కుమార్ తమతో పాటే కానిస్టేబుల్ శ్రీనివాస రావును అక్కడే ఉండేందుకు అంగీకరించారు. 2 రోజుల క్రితం సంతోష్ కుమార్ తన ఇంటిని ఖాళీ చేసి జమ్ము కాశ్మీర్ కు ఇంటి సామాను పంపించారు.

 కమాండర్ ఇంట్లో 30 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాల చోరీ

కమాండర్ ఇంట్లో 30 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాల చోరీ

ఇక బంగారు ఆభరణాలు, కీలకమైన వాటిని మాత్రమే ఇంట్లో ఉంచుకున్న సంతోష్ కుమార్ 11వ తేదీ నా కుటుంబ సభ్యులతో కలిసి తనతో కలిసి పని చేసే అధికారి కుమారుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లారు. ఇదే అదునుగా చూసిన కానిస్టేబుల్ శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలకు హాజరైన హాజరై మధ్యలో అక్కడి నుంచి మాయమై కమాండెంట్ ఇంట్లో ఉన్న 30 లక్షల విలువ చేసే బంగారాన్ని దొంగిలించారు. దొంగలు ఈ పని చేసినట్లుగా సీన్ క్రియేట్ చేశారు.

 దొంగలే దొంగతనం చేసినట్టు సీన్ క్రియేట్ చేసిన కానిస్టేబుల్

దొంగలే దొంగతనం చేసినట్టు సీన్ క్రియేట్ చేసిన కానిస్టేబుల్


ఇంటికి వచ్చి చూసిన కమాండెంట్ తన ఇంట్లో దొంగతనం జరిగినట్టుగా ఎస్పీ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు రెండు గంటల్లోనే ఈ వ్యవహారాన్ని తేల్చేశారు. ఇంటి తాళం చెవులు ఒక సెట్ శ్రీనివాస రావు దగ్గర ఉన్నాయని చెప్పడంతో అతన్ని విచారించిన అధికారులను బుకాయించాడు . తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనకు ఆ బంగారం గురించి తెలియదని పేర్కొన్న శ్రీనివాసరావు , చోరీకి పాల్పడిన వారు దొంగలే అన్నట్లుగా వాదించాడు.

రెండు గంటల్లో కేసును చేదించిన పోలీసులు .. దొంగ ఎవరో తెలిసి అందరూ షాక్

రెండు గంటల్లో కేసును చేదించిన పోలీసులు .. దొంగ ఎవరో తెలిసి అందరూ షాక్


అనుమానం వచ్చిన పోలీసులు గట్టిగా విచారించడంతో అసలు విషయాన్ని బయట పెట్టాడు శ్రీనివాసరావు. చోరీ చేసింది తానేనని, తనకున్న 10 లక్షల రూపాయలు అప్పు తీర్చడం తోపాటు గా భార్యాపిల్లలకు బంగారు ఆభరణాలు చేయించాలన్న ఉద్దేశంతోనే ఈ పని చేసినట్లుగా అంగీకరించారు . అతని వద్దనుండి 30 లక్షల రూపాయల నగలను స్వాధీనం చేసుకుని కమాండెంట్ కుటుంబానికి అందించారు. కుటుంబంలో ఒక వ్యక్తి లా నమ్మించి చోరీకి పాల్పడిన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వ్యవహారం తెలుసుకున్న కమాండెంట్, ఆయన కుటుంబం అవాక్కయ్యారు.

English summary
Robbery held in Santosh Kumar's house, who was the commander of the 10th NDRF Battalion at Nagarjuna University. The thief stolen gold jewelery worth Rs 30 lakh . However, the Mangalagiri police solved the case within two hours. The commander, Santosh Kumar, was shocked when he realised the theft at his house done by CRPF Constable Srinivasa Rao, who was very loyal to his family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X