ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేం: ఏపీపై కేంద్రం బాంబు, బాబుకు షాక్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చింది. ప్రత్యేక హోదా విషయమై కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ ప్రశ్నోత్తరాల సమయంలో శుక్రవారం నాడు స్పందించారు. నేరుగా ఏపీకి లేదని కేంద్రమంత్రి చెప్పనప్పటికీ.. పరోక్షంగా ఏపీకి వర్తిస్తుంది.
బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వలేదని, ప్యాకేజీ మాత్రం ఇచ్చినట్లు చెప్పారు. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. తద్వారా ఏపీకి ప్రత్యేక హోదా విషయమై ఏపీ వాసుల పైన కేంద్రం నీళ్లు జల్లిందని చెప్పవచ్చు.
అయితే, ఏ రాష్ట్రానికి అని చెప్పినప్పటికీ ఏపీకీ హామీ ఇచ్చినందు వల్ల దీనిపై వివరణ ఇవ్వాల్సి ఉంది.
ప్రత్యేక హోదా కోసం మోడీ సీటు ముందు నిరసన
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు శుక్రవారం లోకసభలో నిరసన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీ సీటు ముందు నిరసన తెలిపారు.