వాళ్లలా దుష్ర్పచారం చేస్తూనే ఉంటారు.. నేనే ఆశ్చర్యపోయా: నారా లోకేష్
అభివృద్ధి విషయంలో రాయలసీమను తామెప్పుడూ చిన్నచూపు చూడలేదని, నిర్లక్ష్యం చేయలేదని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. దుష్ప్రచారం చేసే వాళ్లు చేస్తూనే
అమరావతి: అభివృద్ధి విషయంలో రాయలసీమను తామెప్పుడూ చిన్నచూపు చూడలేదని, నిర్లక్ష్యం చేయలేదని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అన్ని జిల్లాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని అన్నారు.
దుష్ప్రచారం చేసే వాళ్లు చేస్తూనే ఉంటారు. ఇటీవల ఓ దుష్ప్రచారం చేశారు. 50 ఏళ్ల వయసు పైబడిన వారిని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి పంపించి వేస్తున్నామని ప్రచారం చేశారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అని లోకేష్ పేర్కొన్నారు.
అసలు ఈ విషయమై ఓ జీవో, డిస్కషన్... ఇలా ఏదీ జరగలేదు. ఎటువంటి ఆధారమూ లేకుండానే దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంగ్లీషులో ఓ సామెత ఉంది.. 'కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయండి' అని.. అటువంటి పనులు చేస్తున్నారన్నారు.
మొన్నామధ్య ఎస్సీ కార్పొరేషన్ ను తీసేస్తున్నామంటూ దుష్ప్రచారం చేశారు. అసలు, నాకే అర్థం కాలేదు. ఈ అంశంపై చర్చ ఎక్కడ జరిగింది? ఎవరితో మాట్లాడారు? అసలు, మా పార్టీకి ఈ ఆలోచనే రాలేదు..' అని లోకేష్ చెప్పుకొచ్చారు.