మూడో దశ స్మార్ట్ సిటీల జాబితా: ఏపీ నుంచి తిరుపతికి చోటు
న్యూఢిల్లీ: మూడో విడత స్మార్ట్ సిటీల జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం ప్రకటించారు. మొత్తం 27 నగరాలకు మూడో దశలో చోటు కల్పించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని చెందిన ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుపతి, ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభ నియోజకవర్గమైన వారణాసికి ఇందులో చోటు దక్కించుకున్నాయి.
స్మార్ట్సిటీల జాబితాలో ఆగ్రా, అజ్మీర్, అమృత్సర్, ఔరంగాబాద్, గ్వాలియర్, హుబ్లి-ధార్వాడ్, జలంథర్, కల్యాణ్-దోంబివాలి, కాన్పూర్, కోహిమా, కోట, మదురై, మంగళూరు, నాగపూర్, నంచి, నాసిక్, రూర్కెలా, సేలం, శివమొగ్గ, థానె, తంజావూరు, తిరుపతి, తంకూరు, ఉజ్జయిని, వడోదర, వెల్లూరు, వారణాసి ఉన్నాయి.
మూడో దశలో మొత్తం 63 పట్టణాలు స్మార్ట్ సిటీల జాబితా కోసం పోటీ పడగా చివరకు 27 మాత్రమే చోటు దక్కించుకున్నాయి. కొత్తగా చేరిన ఈ 27 స్మార్ట్ సిటీలు 12 రాష్ట్రాలకు చెందినవి కావడం విశేషం. రాబోయే రోజుల్లో మిగతా 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఈ మిషన్లో చేరనున్నాయి.
With this announcement, a total investment of Rs.1,44,742 cr has been proposed by 60 cities under smart city plans: Venkaiah Naidu pic.twitter.com/VGEvih0n21
— ANI (@ANI_news) September 20, 2016
LIVE: Here is the new batch of 27 #SmartCities, announced by Minister @MVenkaiahNaidu today (in alphabetical order) https://t.co/iCsQSCkkJA pic.twitter.com/2NhIvLGG57
— PIB India (@PIB_India) September 20, 2016
Congratulations to Andhra Pradesh, Tirupati is selected as a smart city in the 3rd round of competition... All the best... @Moud_India
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) September 20, 2016