ఇది ముమ్మాటికీ బడాయి బడ్జెట్: సిపిఐ రామకృష్ణ
విజయవాడ: ఏపీ బడ్జెట్ పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఘాటుగా స్పందించారు. ఇది ముమ్మాటికీ బడాయి బడ్జెట్టే నని ఆయన ఎద్దేవా చేశారు. గత ఏడాది ఏవిధంగా లక్షన్నర కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి, ఖర్చు చేసే సమయంలో కోతలు విధించారో...ఇప్పుడూ అదే జరుగుతుందన్నారు.
విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎపి బడ్జెట్ ను విశ్లేషించారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈ బడ్జెట్లో ఎలాంటి భరోసా ఇవ్వలేదని చెప్పారు. రైతుల రుణమాఫీ కోసం రు.4100 కోట్లు కేటాయించారని, వీటితో ఈ ఏడాది కూడా రైతుల రుణాలు తీరే అవకాశం లేదన్నారు. అలాగే గ్రామీణాభివృద్ధి, సంక్షేమం పేరిట భారీగా కేటాయింపులు చూపినప్పటికి, ఖర్చు చేసేందుకు నిధులు ఎక్కడనుంచి తీసుకువస్తారో చెప్పలేదని విమర్శించారు.

ఇక సాగునీటి రంగానికి ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చూస్తే వచ్చే పదేళ్ళలో కూడా అవి కంప్లీట్ అయ్యే అవకాశమే లేదన్నారు. నిరుద్యోగ భృతికి సరైన విధివిధానాలు రూపొందించనే లేదన్నారు. మొత్తం మీద ఈ బడ్జెట్ అంచనాలు ఘనంగా, ఆచరణ శూన్యంగా ఉంటుందనేది స్పష్టమవుతోందని విశ్లేషించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications