తోట త్రిమూర్తులు నాకు ఎప్పుడు శత్రువే : పిల్లి సుభాష్ చంద్రబోస్
ఇటివల టీడీపీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుపై డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వంత పార్టీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే తనకు ఎప్పుడు శత్రువే అని ప్రకటించారు. అయన ఎప్పుడు మిత్రుడుగా లేడని పార్టీలో వైసీపిలో చేరినంత మాత్రాన త్రిమూర్తులు మిత్రుడు కాలేడని వ్యాఖ్యానించారు.
గత కొద్ది సంవత్సరాలుగు తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్లు ప్రత్యర్ధులుగా కొనసాగుతున్నారు. కాగ ఇటివల జరిగిన ఎన్నికల్లో తోట త్రిమూర్తులు రామచంద్రపురం అసెంబ్లీ నియోజవర్గం నుండి పోటీ చేయగా వైకాపా అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. దీంతో ఆయన కొద్ది రోజుల క్రితం వైసీపీలో చేరారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన దళితులను అవమానించిన శిరోముండనం కేసులో నిందితుడిగా ఉన్న త్రిమూర్తులను పార్టీలో చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ...దళిత ఐక్యపోరాట వేదిక ఆధ్వర్యంలో పిల్లి సుభాష్ కాన్వాయ్ కూడ అడ్డుకున్నారు. దళితులకు వ్యతిరేకులుగా ఉన్న ఆయన్ను ఎలా పార్టీలో చేర్చుకుంటారని పిల్లి సుభాష్చంద్రబోస్ను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే పార్టీలోకి ఎంతోమంది వస్తూ.. పోతూ ఉంటారు. అయినంత మాత్రన గతంలో ఉన్న శతృత్వం మాసిపోదని అన్నారు. ఆయన అప్పుడు ఇప్పుడు కూడ శత్రువే అని అన్నారు. మరోవైపు కేసు విషయంలో ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.