సిటీలో డ్రగ్ రాకెట్ రట్టు: ముగ్గురి అరెస్ట్, కిలో పట్టివేత
ఆర్టీఏ తనిఖీలు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ తనిఖీలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 11 బస్సులను సీజ్ చేశారు. కృష్ణా జిల్లా గరికపాడు చెక్పోస్టు దగ్గర ఎన్హెచ్-65పై అధికారులు తనిఖీలు నిర్వహించి ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన ఐదు బస్సులను సీజ్ చేశారు.
రౌడీషీటర్ దారుణ హత్య
హైదరాబాదులోని రెయిన్ బజార్లో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతనిని కత్తులతో పొడిచి చంపారు.
వ్యక్తి సజీవ దహనం
మహబూబ్ నగర్ జిల్లాలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు సజీవ దహనం చేశారు.
బస్సు బోల్తా
విశాఖపట్నంలోని యారాడ కొండపైన ప్రయివేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి.
కారులో పగులగొట్టి చోరీ
ఖమ్మం జిల్లా పాలేరులో కారు అద్దాలు పగులగొట్టి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. నలభై తులాల బంగారం, రూ.5.5 లక్షలను ఎత్తుకెళ్లారు.