ఏపీ కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత..! 25స్లిప్పులను బండిల్ గా చేసుకోవాలన్న ఈసీ..!!
అమరావతి/హైదరామాద్ : ఎన్నికల ఫలితాల సమయం సమీపిస్తున్న కొద్ది రాజకీయ నేతల్లో ఉత్కంఠ, అదికారుల్లో హడావిడి కనిపిస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అమరావతిలో కౌంటింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కౌంటింగ్ పై అధికారులకు ఈసీఐ డైరెక్టర్ నిఖిల్ కుమార్ ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ కు 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్వోలు, 13 జిల్లాల కౌంటింగ్ కేంద్రాల పర్యవేక్షకులు హాజరయ్యారు. కౌంటింగ్ కేంద్రాలలో టేబుల్స్ ఏర్పాట్లు, ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో చెప్పట్టే వీడియో కవరేజ్ అంశాలపై ఈసీ స్పష్టమైన సూచనలు చేసింది.
ఈ సందర్భంగా ఈసీఐ డైరెక్టర్ నిఖిల్ కుమార్ మాట్లాడుతూ... కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వీవీపాట్ కౌంటింగ్ కేంద్రం నిర్వహణ, కౌంటింగ్ ప్రక్రియపై ఉన్న సందేహాలను ఈసీ సభ్యులు అడిగితెలుసుకున్నారు. వీవీపాట్ స్లిపులను అభ్యర్థుల వారీగా సాగ్రిగేట్ చేసి, అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాలన్నారు. అభ్యర్థుల వారిగా వీవీపాట్ స్లిపులను 25 స్లిపులను ఒక బండిల్ గా సిద్ధం చేసుకోవాలన్నారు. ఆర్వోలు ఎన్నికల ఫలితాలు ప్రకటన చేసే ముందు పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తర్వాత ప్రకటించాలన్నారు.