విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీడియో తీసి బెదిరింపులు.. భయంతో ముగ్గురు విద్యార్థినులు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం!

విజయవాడ జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యానికి వారిని కొంతమంది యువకులు బెదిరించడమే కారణమని తెలుస్తోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

విజయవాడ: నగరంలోని జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యానికి వారిని కొంతమంది యువకులు బెదిరించడమే కారణమని తెలుస్తోంది.

కిడ్నాప్ కలకలం: కారులో వచ్చారు.. తండ్రి పక్కనుండగానే కూతుర్ని ఎత్తుకెళ్లారు!కిడ్నాప్ కలకలం: కారులో వచ్చారు.. తండ్రి పక్కనుండగానే కూతుర్ని ఎత్తుకెళ్లారు!

పాఠశాల ఆవరణలో ఆ విద్యార్థినులు ఆడుకుంటుండగా కొంతమంది యువకులు వారి వీడియోలు తీశారు. ఆ తరువాత వాటిని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు.

suicide-attempt

దీంతో భయపడిన ఆ ముగ్గురు బాలికలు కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే పాఠశాల ఉపాధ్యాయులు వారిని చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో వారికి ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ విద్యార్థినులను బెదిరించిన యువకుల గురించి ఆరా తీస్తున్నారు.

English summary
Three girl students who are studying seventh class committed attempt to suicide here in Vijayawada on Thursday. While the girls are playing in the school some unknown persons shoot their videos. After that they threatened the girls that they are going to put their morphed videos in the social media. The three girls feared and drank poision mixed cool drink. Staff of the school bring them to the government hospital for treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X