వీడియో తీసి బెదిరింపులు.. భయంతో ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం!
విజయవాడ జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యానికి వారిని కొంతమంది యువకులు బెదిరించడమే కారణమని తెలుస్తోంది.
విజయవాడ: నగరంలోని జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యానికి వారిని కొంతమంది యువకులు బెదిరించడమే కారణమని తెలుస్తోంది.
కిడ్నాప్ కలకలం: కారులో వచ్చారు.. తండ్రి పక్కనుండగానే కూతుర్ని ఎత్తుకెళ్లారు!
పాఠశాల ఆవరణలో ఆ విద్యార్థినులు ఆడుకుంటుండగా కొంతమంది యువకులు వారి వీడియోలు తీశారు. ఆ తరువాత వాటిని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు.
దీంతో భయపడిన ఆ ముగ్గురు బాలికలు కూల్డ్రింక్లో ఎలుకల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే పాఠశాల ఉపాధ్యాయులు వారిని చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో వారికి ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ విద్యార్థినులను బెదిరించిన యువకుల గురించి ఆరా తీస్తున్నారు.