గురుపూజోత్సవానికి వెళ్లి ముగ్గురు బాలికలు అదృశ్యం
కృష్ణా జిల్లా విజయవాడ శివారు పాయకాపురంలో ముగ్గురు అమ్మాయి ల అదృశ్యం అయ్యారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య పాఠశాలలో 9వ తరగతిచదువుతున్న విద్యార్థినులు ఉదయం పాఠశాలకు వెళ్లారు.
విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడ శివారు పాయకాపురంలో ముగ్గురు అమ్మాయి ల అదృశ్యం అయ్యారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య పాఠశాలలో 9వ తరగతిచదువుతున్న విద్యార్థినులు ఉదయం పాఠశాలకు వెళ్లారు. మంగళవారం గురుపూజోత్సవం లోనూ పాల్గొన్నారు.
విద్యార్ధినీలు ముగ్గురు తొమ్మిదో తరగతి పైగా స్నేహితులు. ఏమి జరిగిందో తెలియదు. ఎక్కడికి వెళుతుంది ఎవరికీ చెప్పలేదు. పాఠశాల ముగిసిన అనంతరం పిల్లలందరూ ఇళ్లకు చేరారు. ఈ ముగ్గురు పిల్లలు ఇంకా ఇంటికి వస్తారు అని ఎదురు చూసిన తల్లిదండ్రులు పిల్లలు ఇంటికి చేరక పోయే సరికి పాఠశాలలో ఎంక్వయిరీ చేశారు.
స్కూల్లో ఎవరూ లేరు అందరూ వెళ్లిపోయారని పాఠశాల నిర్వాహకులు చెప్పారు. దీనితో ముగ్గురు విద్యార్ధినీల తల్లిదండ్రులు బంధువుల ఇళ్లకు ఫోన్ చేసి కనుకున్నారు. ఏ విధార్ధినీ ఆచూకీ లభ్యం కాలేదు. ఎక్కడికన్నా వెళితే ఎవరో ఒకరికి విషయం చెప్పే వారు.
కానీ ఇంత వరకు వారి వివరాలు తెలియక పోవడంతో తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. బాలికల తల్లి దండ్రులు వారి బిడ్డల అదృశ్యం పై పోలీసులకు పిర్యాద్ చేశారు. బాలికల కోసం పోలీసులు బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు.