పిడుగుపాటుకి... నలుగురికి గాయాలు
గుంటూరు జిల్లా నకరికళ్ళు మండలం గుళ్లపల్లి లో పిడుగుపడి నలుగురికి గాయాలు అయ్యాయి. స్థానిక నకరికళ్ళు లో పొలం పనుల్లో ఉన్న ముగ్గురు రైతులు ఒక వ్యవసాయ కూలీ లపై పిడుగు పడి తీవ్రగాయాలు పాలయ్యారు.
గుంటూరు: గుంటూరు జిల్లా నకరికళ్ళు మండలం గుళ్లపల్లి లో పిడుగుపడి నలుగురికి గాయాలు అయ్యాయి. స్థానిక నకరికళ్ళు లో పొలం పనుల్లో ఉన్న ముగ్గురు రైతులు ఒక వ్యవసాయ కూలీ లపై పిడుగు పడి తీవ్రగాయాలు పాలయ్యారు.
మంగళవారం మధ్యాహ్నం తరువాత భోజనాలు ముగించుకుని ముగ్గురు రైతులు ఓ వ్యవసాయ కూలీ పొలం లో పని చేసుకుంటున్నారు. ఇదే సమయం లో దట్టమైన మబ్బులు పట్టింది. ఉరుములు, మెరుపులతో సన్న గా వర్షం ప్రారంభమైంది. దీనితో పొలం లో పని చేసుకుంటున్న నలుగురు స్థానికంగా ఓ చెట్టు క్రిందకు చేరారు.
అదే సమయం లో చెట్టుమీద పిడుగు పడింది. ఆ పిడుగు పాటుకి చెట్టు క్రింద ఉన్న నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. విషయం తెలుసు కున్న స్థానికులు వైద్యం కోసం వారిని గ్రామంలోకి తరలించారు. ఒళ్ళు కాలి తీవ్ర గాయాల పాలైన రైతులకు స్థానికం గా ప్రధమ చికిత్స చేసి సెలయిన్ లు ఎక్కించారు.
వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయినట్లు డాక్టర్స్ తెలిపారు. తృటిలో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. బాధితులను ప్రధమ చికిత్స అనంతరం ఇంటికి పంపించారు. అంతకు ముందు ఆసుపత్రి వద్ద బాధితులను ఏ.పీ, స్పీకర్ పరా మరహించారు.