వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపిలో పెద్ద కుట్ర : ఆ ముగ్గురు క‌లిసి ప్లాన్ : చ‌ంద్ర‌బాబు సంచ‌ల‌న ఆరోప‌ణ‌..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assembly Elections 2019 : ఏపిలో పెద్ద కుట్ర ఆ ముగ్గురు క‌లిసి ప్లాన్ : చ‌ంద్ర‌బాబు || Oneindia

ఏపిలో రేపో..ఎల్లుండో పెద్ద కుట్ర జ‌ర‌గ‌బోతోంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసారు. రాష్ట్రం లో పెద్ద ఎత్తున శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య సృష్టించేందుకు మోదీ..కేసీఆర్‌..జ‌గ‌న్ క‌లిసి కుట్ర చేస్తున్నారంటూ ఆరోప‌ణ లకు దిగారు. ముఖ్య‌మంత్రి స్వ‌యంగా ఈ ఆరోప‌ణ‌లు చేయ‌టంతో..అస‌లు ఏపి జ‌రుగుతుంద‌నే దాని పై ఎన్నిక‌ల వేళ చ‌ర్చ కు కార‌ణ‌మైంది..

శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య...

శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య...

ఏపిలో రాష్ట్రంలో పెద్దఎత్తున శాంతి భద్రతల సమస్య సృష్టించాలని నరేంద్ర మోదీ, కేసీఆర్‌, జగన్‌ కలిసి కుట్ర చే స్తున్నారని ముఖ్య‌మంత్రి చంద్రబాబు ఆరోపించారు. రేపో..ఎల్లుండో పెద్ద కుట్ర జ‌ర‌గబోతోంద‌ని చెప్పుకొచ్చారు. దీని కోస‌మే జ‌గ‌న్ ఒక రోజు ప్ర‌చారం నిలిపి వేసి లోట‌స్ పాండ్ లో మంత‌నాలు సాగించార‌ని పేర్కొన్నారు. ఏపి ప్ర‌జ‌ల‌కు ల‌క్ష కోట్లు ఎగ్గొట్ట‌డానికి జ‌గ‌న్ కు కేసీఆర్ వెయ్యి కోట్లు ఇచ్చార‌ని ఆరోపించారు. జ‌గ‌న్ ఇచ్చే పాపిష్టి డ‌బ్బును పంచటాని కి మీ ముందుకు వ‌స్తున్నార‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. ఆలా డ‌బ్బులు ఇవ్వ‌టానికి వ‌చ్చిన వారిని కట్టి ప‌డేయండి అంటూ పిలుపునిచ్చారు. జ‌గ‌న్ మీ వ‌ద్ద‌కు వ‌స్తే మీకు మేం ఓటు వేయ‌బోమ‌ని తేల్చి చెప్పండ‌ని సూచించారు.

ఐటి దాడుల పైనా బాబు ప్ర‌స్తావ‌న‌..

ఐటి దాడుల పైనా బాబు ప్ర‌స్తావ‌న‌..

ఏపిలో ఎన్నిక‌ల స‌మ‌యంలో టిడిపి అభ్య‌ర్దుల ను ల‌క్ష్యంగా చేసుకొని ఆదాయ‌పు ప‌న్ను అధికారులు దాడులు చేస్తార ని చంద్ర‌బాబు అనుమానం వ్య‌క్తం చేసారు. ఇప్ప‌టికే ఉగ్ర న‌ర‌సింహారెడ్డి, నారాయ‌ణ‌, పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ పైనా దాడులు జ‌రిగాయ‌ని..రానున్న నాలుగు రోజుల్లో మ‌రి కొంద‌రిని బెదిరించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతాయ‌ని చెప్పుకొచ్చారు . తమ పై దాడులు చేస్తే భ‌య‌ప‌డ‌తామా అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. త‌న పైనా దాడులు చేయాల‌ని చూస్తున్నార ని..త‌న పై దాడి అంటే అది రాష్ట్రం పై దాడి అని పేర్కొన్నారు. వీరి కుట్ర‌ల‌కు ఓటు తోనే స‌మాధానం చెప్పాల‌ని.. ఆం ధ్రుల పౌరుషం చాటాలని పిలుపునిచ్చారు.

ప్ర‌త్యేక హోదా పై తీర్మానం చేయాలి..

ప్ర‌త్యేక హోదా పై తీర్మానం చేయాలి..

ఏపికి ప్ర‌త్యేక హోదా విషయంలో కేసీఆర్ మ‌ద్ద‌తు ఇస్తాన‌నే అంశాన్ని జ‌గ‌న్ కు చెవిలో చెప్పారా అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. దీని పై కేసీఆర్ తో లేఖ రాయించాల‌ని డిమాండ్ చేసారు. ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని సోనియా చెప్పిన రోజే..త‌మ‌కు హోదా ఇవ్వాలంటూ కేసీఆర్ కోరిన విష‌యాన్ని చంద్ర‌బాబు గుర్తు చేసారు. నిజంగా కేసీఆర్ ఏపికి ప్ర‌త్యేక హోదాకు మ‌ద్దతు ఇస్తుంటే..ఆయ‌న ప్రత్యేక హోదాపై ఫెడరల్‌ ఫ్రంట్‌లో తీర్మానం చేయాలి అని డిమాండ్ చేసారు. కేసీఆర్‌ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌కు.. ప్రత్యేక హోదా కోసమే మద్దతిస్తున్నానని జగన్‌ చెబుతున్నా రని... హోదా పై కేసీఆర్ ప్ర‌కట‌న చేయాల‌ని కోరారు.

English summary
AP chief minister Chandra babu says Modi,kcr and jagan planning to disturb law and order in AP. Chandra babu demand KCR should announce open support for AP Special status.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X