వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
స్కానింగ్: ఇకపై తిరుమలలో ఆ రూల్ తప్పనిసరి!..
ఇకపై జారీ చేసే ప్రతీ టికెట్టును స్కానింగ్ చేయనున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు.
తిరుమల: శ్రీవారి టికెట్లలో పలు అవకతవకలకు ఆస్కారం లేకుండా చేసేందుకు.. ఇకపై జారీ చేసే ప్రతీ టికెట్టును స్కానింగ్ చేయనున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. ఈ విషయంపై మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.
శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాల టికెట్లకు సంబంధించి ఎలాంటి అవకతవకలు లేకుండా చూసేందుకు గట్టి చర్యలు చేపట్టినట్లు సాంబశిరావు పేర్కొన్నారు. వీటి మూలంగానే ఇటీవల నకిలీ టికెట్లు చాలా ఎక్కువగా దొరికిపోతున్నాయని అన్నారు. బ్రేక్ దర్శన టికెట్లను కొనుగోలు చేసే సమయంలో వచ్చే టోకెన్ల సంఖ్యలను తగ్గించామని వెల్లడించారు. డోనర్ మేనేజ్ మెంట్ విధానాన్ని మరింత మెరుగుపరిచినట్లు తెలిపారు. దాతలు కూడా దీనిపట్ల సంతృప్తి వ్యక్తం చేశారని ఈవో చెప్పుకొచ్చారు.
Comments
English summary
On tuesday Ttd EO Sambasivarao talked to media on ticket issuing process in tirumala. He said soon ticket scanning process will begin
Story first published: Wednesday, March 15, 2017, 17:10 [IST]