గోవిందా గోవిందా: ఏడుకొండల స్వామికి డబ్బేడబ్బే
తిరుమల: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల రద్దీ తగ్గింది. భక్తుల రద్దీ చాల తగ్గినా అనూహ్యంగా హుండీ ఆదాయం పెరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వ దర్శనానికి రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. భక్తులు తక్కువ సమయంలో స్వామివారికి దర్శించనున్నారు.
ప్రత్యేక దర్శనానికి ఒక గంట, కాలినడకన వచ్చిన భక్తులకు రెండు గంటలు, సర్వ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీ వెంకటేశ్వర స్వామిని 67,241 మంది భక్తులు దర్శించుకున్నారు. కల్యాణకట్టలో 25,643 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తుల రద్దీ తగ్గిపోయినా సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.18 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు. పెద్ద నోట్లు రద్దు ప్రభావం స్వామివారి భక్తుల మీద ఎలాంటి ప్రభావం చూపించలేదు. భక్తుల రద్దీ తక్కువగా ఉన్నా ఆదాయం రావడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామి వారిని దర్శించుకుని వెలుతున్నారు.
తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల రద్దీ తగ్గింది. భక్తుల రద్దీ చాల తగ్గినా అనూహ్యంగా హుండీ ఆదాయం పెరిగింది. సోమవారం శ్రీ వెంకటేశ్వర స్వామిని 67,241 మంది భక్తులు దర్శించుకున్నారు. కల్యాణకట్టలో 25,643 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల రద్దీ తగ్గిపోయినా సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.18 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.