తమిళ కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్య: నొచ్చుకున్న రోశయ్య, పరువునష్టం దావా
చెన్నై: తమిళనాడు గవర్నర్ గవర్నర్ కొణిజేటి రోశయయ్ బుధవారం నాడు తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇళంగోవన్ పైన పరువు నష్టం దావా వేశారు. ఓ ప్రాంతీయ టీవీ షోలో తన పైన చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన కేసు వేశారు.
మద్రాసు హైకోర్టులో ఈ పరువు నష్టం దావా వేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎంఎల్ జెగన్ వివరించారు. విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతుల నియమానికి సంబంధించి ముఖ్యమంత్రి జయలలిత ఇచ్చిన ముడుపులను రోశయ్య తీసుకున్నారని ఇళంగోవన్ గత ఏడాది ఆరోపించారు.
ఒక్కో వైస్ ఛాన్సులర్ పోస్టుకు పదిహేను కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. అందులో పది కోట్ల రూపాయలు జయలలితకు వచ్చి, ఐదు కోట్లు గవర్నర్ తన వద్దే ఉంచుకున్నారని ఆరోపించారని తెలుస్తోంది. ఈ సంచలన వ్యాఖ్యలపై రోశయ్య నొచ్చుకున్నారు. తన న్యాయవాది ద్వారా దావా వేశారు.
ఓ ప్రాంతీయ టీవీ ఛానల్కు ఇళంగోవన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో పై ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు అవాస్తవమని, ముఖ్యమంత్రికి, గవర్నర్కు అపకీర్తి తెచ్చేలా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఆయన పైన పరువు నష్టం దావా వేసినట్లు చెప్పారు.