వాల్మార్ట్లో కందిపప్పు అమ్మకం, దేవినేని అవినాష్ అరెస్ట్
విజయవాడ/అనంతపురం: విజయవాడలోని వాల్ మార్ట్ షోరూంలో కందిపప్పు విక్రయ కేంద్రాన్ని మంత్రి పరిటాల సునీత సోమవారం నాడు ప్రారంభించారు. రూ.140కే ఇక్కడ కందిపప్పు విక్రయించనున్నట్లు చెప్పారు. రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పును రూ.40కే ఇస్తున్నట్లు చెప్పారు.
చంద్రబాబును కలిసిన ఆస్ట్రేలియా ప్రతినిధులు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సోమవారం ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా బృందం ముఖ్యమంత్రితో పలు విషయాలు చర్చించింది.
ఏపీలో షిప్పింగ్, మైనింగ్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని ఆస్ట్రేలియా మంత్రి మైక్ నహాన్ చెప్పారు. పాల ఉత్పత్తి మార్కెటింగులో సహకరిస్తామన్నారు.
క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నం
విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యువజ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. వారు లోపలకు వెళ్లే ప్రయత్నాలు చేయగా పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ యువనేత దేవినేని అవినాష్ సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.