వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాల్వాయికి కాంగ్రెస్ షోకాజు నోటీసు: మరో ఎమ్మెల్సీకీ..

|
Google Oneindia TeluguNews

TPCC issued a show cause notice to Palvai and Rajeswar Rao
హైదరాబాద్: ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నాయకులపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొరఢా ఝుళిపించింది. ఇందులో భాగంగానే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అభియోగంపై రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావులకు తెలంగాణ పిసిసి షోకాజు నోటీసులు జారీ చేసింది.

కాంగ్రెస్ అధిష్టానం పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావులపై చర్యలు తీసుకునేందుకు అనుమతివ్వడంతోనే టిపిసిసి వీరికి షోకాజు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా,
నల్గొండ జిల్లాలోని మునుగోడులో కాంగ్రెస్ రెబల్ అసెంబ్లీ అభ్యర్థిగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు స్రవంతి రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలోనే పాల్వాయికి షోకాజు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

కాగా, ఇటీవల కేంద్రమంత్రి జైరాం రమేష్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి ఇంటికెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. నల్గొండ జిల్లాలోని మునుగోలు నుంచి కాంగ్రెస్ పార్టీ రెబల్‌గా నామినేషన్ వేసిన పాల్వాయి కుమార్తె స్రవంతి రెడ్డితో నామినేషన్ ఉపసంహరింపచేయాలని జైరాం రమేష్ ఆయనకు సూచించారు.

పాల్వాయితో సమావేశమైన జైరాం రమేష్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే హైకమాండ్ చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా జైరాం రమేష్ హెచ్చరించారు. కాంగ్రెస్-సిపిఐ పొత్తులో భాగంగా మునుగోలు సీటును సిపిఐకి కేటాయించడంతో కాంగ్రెస్ పార్టీ ఈ స్థానం నుంచి తమ అభ్యర్థిని పోటీకి దింపలేదు.

English summary
Telangana PCC on Friday issued a show cause notice to Congress MP Palvai Govardhan Reddy and MLC Rajeswar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X