తీవ్ర వ్యాఖ్యలు: పాల్వాయిపై వేటుకు సిఫార్సు
ఎన్నికల్లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. పాల్వాయికి ఇంతకు ముందే కాంగ్రెసు పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. నల్లగొండ జిల్లా మునుగోడు శాసనసభా స్థానం నుంచి కాంగ్రెసు తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసిన తన కూతురు స్రవంతికి ఆయన ప్రచారం చేశారు.
దానికితోడు, ఎన్నికల్లో కాంగ్రెసు ఓటమికి కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్, టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ నేత జానారెడ్డి కారణమని ఆనయ ఆరోపించారు కెసిఆర్తో పొత్తు పెట్టుకోవాలని, తెలంగాణ బిల్లు వ్యవహారంలో కెసిఆర్ను భాగస్వామిని చేయాలని చెప్పినా వారు వినలేదని, కెసిఆర్ కాంగ్రెసులోకి వస్తే తమకు సిఎం పదవి దక్కదని వారు దురాశతో వ్యతిరేకించారని ఆయన విమర్శించారు.
పొత్తులో భాగంగా మునుగోడు శాసనసభా స్థానాన్ని కాంగ్రెసు సిపిఐకి కేటాయించింది. దాన్ని వ్యతిరేకిస్తూ స్రవంతి రెడ్డి పోటీకి దిగారు. పోటీ నుంచి విరమించుకోవాలని పార్టీ అధిష్టానం సూచించినా ఆమె వెనక్కి తగ్గలేదు.