రక్షణ చర్యలు: ఐటి ఉద్యోగులకు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: హైదరాబాద్, సైబరాబాద్ నగరాల్లో ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెంచేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే భాగంగా ఐటి కంపెనీల వాహనాలపై ఆంక్షలు విధించారు.
హైదరాబాద్ పరిధిలో Q&R కోడ్ స్టిక్కర్లున్న వాహనంలోనే ఐటి ఉద్యోగులు ప్రయాణించాలని ట్రాఫిక్ అధికారులు సూచించారు. Q&R స్టిక్కర్లు లేనివారికి 500 రూపాయల జరిమానా విధిస్తామని హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ హెచ్చరించరాు.
అభయ తరహా కేసులు పునరావృతం కాకుండా ఐదు సూత్రాల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కొన్నాళ్ల క్రితం ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగనిపై అత్యాచారం జరిగిన సంఘటన హైదరాబాదులో సంచలం రేపింది.
నేరాలను అరికట్టేందుకు, ట్రాఫిక్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు 6 కోట్ల రూపాయలతో 120 సిసి కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆనంద్ మీడియా ప్రతినిధులతో చెప్పారు.