కాలువలోకి దూసుకెళ్లిన కారు, ఆరుగురి ప్రాణాలు కాపాడిన చెట్టుకొమ్మ
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో ఓ చెట్టు కొమ్మ ఆరుగురి ప్రాణాలను కాపాడింది. శనివారం నాడు ఈ సంఘటన జరిగింది.
గుంటూరు: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో ఓ చెట్టు కొమ్మ ఆరుగురి ప్రాణాలను కాపాడింది. శనివారం నాడు ఈ సంఘటన జరిగింది.
తెనాలి మండలం నందివెలుగుకు చెందిన ఓ కుటుంబం విజయవాడలో ఓ కార్యక్రమానికి హాజరైంది. తిరిగి కారులో వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
రేవేంద్రపాడు బ్రిడ్జి వద్ద అదుపు తప్పిన కారు ప్రవహిస్తున్న కాలువలోకి దూసుకెళ్లింది. అయితే కాలువలో జారిపోతున్న కారును ఒడ్డున ఉన్న చెట్టు కొమ్మలు అడ్డుకున్నాయి. ఆ కారు కాలువలోకి వెళ్లకుండా కొమ్మలు ఆపాయి.
దీంతో కాలువలోకి పూర్తిగా వెళ్లకుండా కారు నిలిచిపోయింది. ఈ కారులో ఆరుగురు ఉన్నారు. చెట్టు కొమ్మ అడ్డుకోకుండా ఉండే పెద్ద ప్రమాదం జరిగేది. కారు టైరు పంక్చర్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.
Comments
English summary
Tree branch saves 6 lives in Guntur district on Saturday.
Story first published: Sunday, October 15, 2017, 10:45 [IST]