చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు, బిక్కుబిక్కుమంటూ జనాలు
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం వెలుతురుచేను పంచాయతీ పరిధిలో ఆదివారం స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ కారణంగా రెండు నివాస ఇళ్లు బీటలు వారాయి. శనివారం సాయంత్రం నుంచి నాలుగుసార్లు భూప్రకంపనలు
చిత్తూరు: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం వెలుతురుచేను పంచాయతీ పరిధిలో ఆదివారం స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
ఈ కారణంగా రెండు నివాస ఇళ్లు బీటలు వారాయి. శనివారం సాయంత్రం నుంచి నాలుగుసార్లు భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.
ప్రకంపనలకు ముందు పేలుళ్ల శబ్ధం వస్తోందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై అధికారులకు సమాచారం అందించారు. ప్రకంపనల కారణంగా గ్రామస్తులు భయాందోళనతో గడుపుతున్నారు.
Comments
English summary
Mild tremors at Bangarupalyam mandal in Chittoor district have caused panic among the residents.
Story first published: Sunday, October 29, 2017, 14:25 [IST]