వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిలో 3 జెడ్పీలు తెరాస వశం, కాంగ్రెస్, టిడిపిలకి ఒక్కోటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సీమాంధ్రలో తెలుగుదేశం, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎక్కువ జెడ్పీలను కైవసం చేసుకుంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాలుగు, తెలంగాణలో కాంగ్రెసు పార్టీ ఒక్క జెడ్పీని గెలుచుకుంది. అనూహ్యంగా ఖమ్మం జెడ్పీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది.

తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి 3 (అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్), కాంగ్రెసు పార్టీ 1 (నల్గొండ), తెలుగుదేశం పార్టీ 1 (ఖమ్మం) జెడ్పీని కైవసం చేసుకున్నాయి. నాలుగు జిల్లాల్లో ఎవరికీ మెజార్టీ రాలేదు. అయితే కొన్నింట కాంగ్రెసు, మరికొన్నింట తెరాస ఆధిక్యంలో ఉంది.

అదిలాబాద్(52)లో తెరాస 39, కాంగ్రెస్ 9, టిడిపి 2, కరీంనగర్(57)లో తెరాస 41, కాంగ్రెస్ 14, టిడిపి 1, బిజెపి 1, నిజామాబాద్(36)లో తెరాస 24, కాంగ్రెస్ 12, ఖమ్మం(46) టిడిపి 22, కాంగ్రెస్ 10, వైయస్సార్ కాంగ్రెస్ 6, నల్గొండ(59)లో కాంగ్రెస్ 43, తెరాస 13, టిడిపి 2 జెడ్పీటీసీలను కైవసం చేసుకున్నాయి.

TRS wins 3 ZPs and Congress one

మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఎవరికీ మెజార్టీ రాలేదు. అయితే వరంగల్(50)లో కాంగ్రెస్ 24, తెరాస 18, టిడిపి 6, మెదక్(46)లో కాంగ్రెస్ 21, తెరాస 21, టిడిపి 4, రంగారెడ్డి(33)లో కాంగ్రెస్ 15, తెరాస 12, టిడిపి 6, మహబూబ్ నగర్(64)లో కాంగ్రెస్ 29, తెరాస 23, టిడిపి 9 జెడ్పీటీసీలను కైవసం చేసుకుంది.

ఇప్పటి వరకు తెలంగాణలో కాంగ్రెసు 2311 ఎంపీటీసీలు, 177 జెడ్పీటీసీలను, తెరాస 1884 ఎంపీటీసీలను, 191 జెడ్పీటీసీలను, టిడిపి 1040 ఎంపీటీసీలను, 52 జెడ్పీటీసీలను గెలుచుకుంది. సీమాంధ్రలో టిడిపి 5017 ఎంపీటీసీలను, 362 జెడ్పీటీసీలను, వైయస్సార్ కాంగ్రెసు 3977 ఎంపీటీసీలను, 254 జెడ్పీటీసీలను గెలుచుకుంది.

English summary

 TRS wins 3 ZPs and Congress one
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X