రేపు టీటీడీ ప్రత్యేక దర్శన్ టికెట్లు... మిగతా టోకెన్ల వివరాలివే...
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం జూలై నెల ప్రత్యేకప్రవేశ దర్శన టికెట్లు రూ.300/- కోటాను సోమవారం(జూన్ 29) నుంచి ఆన్లైన్లో టీటీడీ అందుబాటులో ఉంచనుంది. రోజుకు 9వేల టికెట్ల చొప్పున జారీ చేయనున్నారు.
సీఎం మనోడే..తిరుమల మనదే: జగన్ బాబాయ్ బర్త్డే వేడుకలు: నిబంధనలు బేఖాతర్..!
అలాగే జూన్ 30 నుంచి రోజుకు 3 వేలు చొప్పున సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. తిరుపతిలోని విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసంలోని కౌంటర్ల ద్వారా భక్తులకు జారీ చేయనున్నారు. జూలై 1న శ్రీవారి దర్శనానికి సంబంధించిన టోకెన్లను జూన్ 30న తిరుపతిలోని కౌంటర్లలో జారీ చేస్తారు.
జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూలై 16న ఆణివర ఆస్థానం నిర్వహిస్తారు. జూలై 24న శ్రీ ఆండాళ్ తిరువాడిప్పూరం శాత్తుమొర, తిరుమల శ్రీవారు పురిశైవారితోటకు వేంచేపు నిర్వహిస్తారు. జూలై 30 నుండి ఆగస్టు 1వ తేదీ వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు జరుగుతాయి.