జగన్ పార్టీ జెండాతో తులసి రెడ్డి, సోనియాపై నిప్పులు
సోనియా గాంధీకి మానవత్వం లేదని, కళ్లులేవని మండిపడ్డారు. అవే ఉండి ఉంటే రాష్ట్రాన్ని విభజించాలనుకునే వారు కాదన్నారు. కేంద్ర కేబినెట్లో నోట్ పెట్టడం, ఆమోదించిన విధానం చాలా దుర్మార్గమన్నారు. తెలుగు జాతికి కాంగ్రెసు తీర్ని ద్రోహం చేసిందని, సీమాంధ్రలో పార్టీకి నామరూపాలు ఉండవని విమర్శించారు.
సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే ఓ రికార్డు అని పేర్కొన్నారు. రాజీనామాలు చేస్తే ప్రభుత్వం పడిపోదని చెప్పారు. అదే సమయంలో మరిన్ని ఇబ్బందులు వస్తాయని అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన కూడా ఆయన మండిపడ్డారు.
అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నారు. అప్పుడు జగన్ పార్టీ నేతలకు తులసి రెడ్డి కనిపించారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేయాలని వారు కోరారు. దీంతో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జెండా పట్టుకొని సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు.