వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శ్రీశైలంలో తవ్వకాలు, బయటపడిన సొరంగం: 8వ శతాబ్ద వస్తువులు లభ్యం
శ్రీశైలం: శ్రీశైలం రుద్రాక్ష మఠంలో ఓ సొరంగం బయటపడింది. అభివృద్ధి పనుల కోసం దేవస్థానం, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న తవ్వకాల్లో సుమారు పది అడుగుల లోతైన సొరంగాన్ని గుర్తించారు.
ఈ తవ్వకాలలో పురాతన వస్తువులు లభించాయి. అవి ఎనిమిదో శతాబ్ధానికి చెందినవిగా గుర్తించారు. వాటిల్లో పూజ, వంట సామగ్రి అధికంగా ఉన్నాయి.
దీపం పెట్టుకునేందుకు వీలుగా కొన్ని వస్తువులు ఉన్నాయని అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు వాటిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
Comments
English summary
Tunnel found in Andhra Pradesh's Srisailam Rudraksha Matham.
Story first published: Wednesday, January 31, 2018, 16:46 [IST]