వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి టీవీఎస్ గ్రూప్ రూ.2 కోట్ల విరాళం

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్టుకు శనివారం నాడు రెండు కోట్ల రూపాయల విరాళం అందింది. చెన్నైకి చెందిన టివిఎస్ మోటార్స్ సంస్థ అధ్యక్షుడు, సీఈవో రాధాకృష్ణన్ ఒక కోటి రూపాయలు, చెన్నైకి చెందిన సుందరం క్లేటన్ లిమిటెడ్ సంస్థ సీఈవో రంగనాథన్ రూ. కోటి ఇచ్చారు.

 TVS Group offers Rs 2 crore to Lord Venkateswara temple

ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివ రావుకు విరాళాల డిడిలను దాతలు అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు శ్రీవారి తీర్థప్రసాదాలను ఈవో వారికి అందజేశారు.

 TVS Group offers Rs 2 crore to Lord Venkateswara temple

కాగా, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారికి పుష్పపల్లకి ఉత్సవం శనివారం కన్నులపండువగా సాగింది. సుగంధ పరిమళాలను వెదజల్లే వర్ణరంజిత పుష్పాలతో సర్వశోభాయమానంగా తీర్చిదిద్దిన పుష్పపల్లకిని ఉభయ దేవేరులతో కలిసి స్వామివారు అధిరోహించారు.

English summary
Two companies of the TVS Group today made an offering of Rs 2 crore to the famous hill shrine of Lord Venkateswara at nearby Tirumala here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X