వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లాన్‌తోనే ఎన్‌కౌంటర్లు, స్మగ్లింగులో టిడీపీ, వైసిపి పాత్ర: నారాయణ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లు పథకం ప్రకారం జరిగాయని సీపీఐ జాతీయ నేత నారాయణ ఆరోపించారు. పోలీసుల కనుసన్నల్లోనే ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరుగుతోందని, ఎర్రచందనం సరఫరాకు పోలీసులే సహకరిస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలుగు రాష్రాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ, వైసీపీ నేతల్లో కొందరికి స్మగ్లింగ్‌తో సంబంధాలున్నాయని, ఆ వివరాలు బయటికి రాకుండా ఉండాలనే కూలీలను ఎన్‌కౌంటర్‌ పేరుతో చంపేశారని నారాయణ ఆరోపించారు. ప్రభుత్వానికి దమ్ముంటే స్మగ్లర్లను పట్టుకోవాలని నారాయణ సవాల్‌ విసిరారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఈ ఎన్‌కౌంటర్‌ మాయని మచ్చగా అభివర్ణించారు.

 Narayana

తెలంగాణలో జరిగిన వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కూడా బూటకపు ఎన్‌కౌంటరేనని నారాయణ ఆరోపించారు. సిద్ధయ్య కుటుంబానికి రూ. కోటి పరిహారమివ్వాలని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నల్గొండ జిల్లాలో పోలీసులపై ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి బాధ్యాతారాహిత్యంగా మాట్లాడారని విమర్శించారు.

అప్పుడే మేల్కొని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని నారాయణ అభిప్రాయపడ్డారు. హోం మంత్రి పదవికి నాయిని సరిపోరని అంటూ నాయిని హోం మంత్రి పదవి నుంచి దిగిపోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. పోలీసులకు కొత్త వాహనాలే కాదు మంచి ఆయుధాలు కూడా ఇవ్వాలని ఆయన అన్నారు. సిపిఐ రాష్ట్ర నేత చాడ వెంకటరెడ్డి కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

English summary
CPI leader K Narayana said that the encounters in Telangana and Andhra Pradesh are planned
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X