వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు షాక్: కెసిఆర్‌తో టచ్‌లో ఇద్దరు ఎమ్మెల్యేలు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Two MLAs seeing at TRS
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి తెలంగాణ ప్రాంతంలో వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ శాసన సభ్యులు పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు షాక్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాకు చెందిన నేతలు మహేందర్ రెడ్డి, కెఎస్ రత్నంలు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో టచ్‌లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెసు పార్టీతో విలీనం లేదా పొత్త విషయమై కెసిఆర్ ఢిల్లీలో కాంగ్రెసు పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ చర్చలు ముగిసి, ఓ నిర్ణయం వచ్చాక వారు తెలుగుదేశం పార్టీని వీడి తెరాసలో చేరే అవకాశముందంటున్నారు. తెరాసను విలీనం చేస్తే వారు చేరకపోవచ్చునని చెబుతున్నారు. అయితే, బాబుతో సాన్నిహిత్యం ఉన్న వీరు పార్టీని వీడే అవకాశాలు లేవని చెబుతున్నారు.

పల్నాడును రాజధానిగా చేయాలి

నరసారావుపేట కేంద్రంగా మూడు రెవెన్యూ డివిజన్లతో పల్నాడు జిల్లాను ఏర్పాటు చేయాలని దిగ్విజయ్ సింగ్‌కు సూచించానని కాసు వెంకటకృష్ణా రెడ్డి తెలిపారు.

ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌తో భేటీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని కోరానని అన్నారు. దిగ్విజయ్‌కు మూడు అంశాలపై తాను సూచనలు చేశానని అన్నారు.

English summary

 It is said that Two main leaders from Ranga Reddy district are seeing at Telangana Rastra Samithi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X