'పుట్టా' నియామక వివాదం: శివస్వామికి మద్దతుగా మరో ఇద్దరు పీఠాధిపతులు
గుంటూరు: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా పుట్టా సుధాకర్ యాదవ్ నియామకంపై వివాదం రేగుతున్న సంగతి తెలిసిందే. ఆయనకు క్రైస్తవ సంస్థలతో సంబంధాలున్నాయని శివస్వామి ఆరోపించడం.. ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి టీటీడీ అత్యున్నత పదవిని చేపడితే ఓర్వలేకపోతున్నారని ఆ వర్గం వారు ఆందోళనలకు దిగడంతో.. ఈ రచ్చ మరింత ముదిరింది.
చూడబోతే ఈ వివాదానికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా లేదు. సుధాకర్ యాదవ్ నియామకాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న శివస్వామికి తాజాగా మరో ఇద్దరు పీఠాధిపతులు మద్దతుగా నిలిచారు. పీఠాధిపతులు పరమేశ్వరానంద, భవానీ శంకరానంద శివస్వామితో ఏకీభవిస్తున్నట్టు తెలిపారు.
టీటీడీ చైర్మన్గా పుట్టా సుధాకర్ యాదవ్ నియామకాన్ని ఖండిస్తున్నామని వారు చెప్పారు. పుట్టా సుధాకర్ యాదవ్ అనేక చోట్ల క్రైస్తవ మత ప్రచారంలో పాల్గొన్నారని, ఇలాంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమించడం దౌర్భాగ్యమని వారు వ్యాఖ్యానించారు.