ప్రమాదం కూడ స్నేహితులను వీడదీయలేదు
పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే చనిపోగా, మరోకరు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.రాజశేఖర్, అచ్యుతరామారావు, భావన చిరంజీవిలు ప్రాణస్న
పశ్చిమగోదావరి జిల్లా :ఆ ముగ్గురు ప్రాణ స్నేహితులు, చిన్నప్పటి నుండి స్నేహితులుగానే ఉన్నారు. వివిద వృత్తుల్లోకి కొనసాగుతోన్న తమ స్నేహాన్ని మాత్రం కొనసాగించారు. అయితే ప్రమాదంలో కూడ ఒకరిని విడిచి మరోకరు ఉండలేదు. ముగ్గురిలో ఇద్దరు మరణించగా, మరోకరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిని కొయ్య రాజశేఖర్, మేడపాటి అచ్యుతరావు, భావన చిరంజీవిలు ప్రాణస్నేహితులు. చిన్నప్పటి నుండి ముగ్గుురు కలిసే తిరుగుతారు.స్థానిక సుబ్బరాజుపేటలో జరగనున్న వివాహ పనుల్లో ఈ ముగ్గురు దగ్గరుండి పనిచేస్తున్నారు.గురువారం తెల్లవారుజామున మోటార్ సైకిల్ పై నిడదవోలు పట్టణం వెళ్ళారు, తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.
గాంధీనగర్ సీతారామరాజు బొమ్మ వద్ద మోటార్ బైక్ అదుపుతప్పి విద్యుత్ స్థంబాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొయ్య రాజశేఖర్ ,అత్యుతరామారావు అక్కడికక్కడే మరణించాడు. భావన చిరంజీవి మాత్రం తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు.
చనిపోయిన రాజశేఖర్ కు ఇద్దరు సోదరులు, సోదరి ఉంది. అచ్యుతరామారావు వారి తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. వీరి మరణంతో కటుుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు. ప్రాణస్నేహితుల్లో ఇద్దరు మరణించగా, మరోకరు ప్రాణపాయంలో ఉన్నాడు.