ఎంపీలకు బాబు దిశానిర్దేశనం: కాసేపట్లే సుజన, అశోక్ రిజైన్! జాతీయ నేతలకు లేఖలు
Recommended Video
న్యూఢిల్లీ/హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం ఢిల్లీలోని పార్టీ ఎంపీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ అంశాలపై చర్చించారు. రాజీనామాల అనంతరం ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించారు.
ఏపీ పట్ల సానుభూతి, 2 అంశాలే మిగిలి ఉన్నాయి, మీరు కోరింది కాదు: జైట్లీ షాక్, బాబు కోర్టులోకి బంతి
తమకు రాజకీయ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు నాయుడు వారితో చెప్పారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని జాతీయస్థాయి దృష్టికి తీసుకు వెళ్లాలని ఆయన ఎంపీలకు సూచించారు.
కాగా, సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులు రాజీనామా చేయడానికి ముందు లోకసభ, రాజ్యసభల్లో మాట్లాడే అవకాశముంది. లోకసభలో రూల్ నెంబర్ 357, రాజ్యసభలో రూల్ నెంబర్ 241 ప్రకారం వారు మాట్లాడనున్నారు. ఆ తర్వాత రాజీనామా సమర్పించనున్నారు.
TDP MP YS Chowdary and Ashok Gajapathi Raju to give a statement in Rajya Sabha & Lok Sabha respectively. (File pics) pic.twitter.com/Kb5hfWdtrF
— ANI (@ANI) March 8, 2018
జాతీయ పార్టీ నేతలకు టీడీపీ నేతలు లేఖలు ఇవ్వనున్నారు. ఆ లేఖల్లో ఏపీకి జరిగిన అన్యాయం, రాజీనామాలకు కారణం తెలపనున్నారు.