ఏపీ రాజ్యసభ ఎన్నికల పోలింగ్- ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల గైర్జాజరు - వైసీపీకి ఓటేసిన రాపాక
ఏపీలో
నాలుగు
సీట్లకు
జరిగిన
రాజ్యసభ
ఎన్నికలు
ముగిశాయి.
ఉదయం
పోలింగ్
ప్రారంభం
కాగానే
సీఎం
జగన్,
ఆ
తర్వాత
విపక్ష
నేత
చంద్రబాబుతో
పాటు
ఎమ్మెల్యేలంతా
ఒక్కొక్కరుగా
వచ్చి
ఓటు
హక్కు
వినియోగించుకున్నారు.
వైసీపీకి
చెందిన
151
మందితో
పాటు
టీడీపీకి
చెందిన
21
మంది,
జనసేన
ఎమ్మెల్యే
రాపాక
ఓటు
వేసిన
వారిలో
ఉన్నారు.
అనారోగ్యం,
ఇతర
కారణాలతో
టీడీపీకి
చెందిన
ఇద్దరు
ఎమ్మెల్యేలు
అనగాని
సత్యప్రసాద్,
అచ్చెన్నాయుడు
హాజరు
కాలేదు.
అనగాని
హోం
క్వారంటైన్
లో
ఉండగా..
అచ్చెన్నాయుడు
సర్జరీ
తర్వాత
గుంటూరు
జీజీహెచ్
లో
చికిత్స
పొందుతున్నారు.
పోలింగ్ సరళిని బట్టి చూసినా, మెజారిటీ రీత్యా చూసినా రాజ్యసభ బరిలో ఉన్న నలుగురు వైసీపీ అభ్యర్ధుల విజయం ఖాయమని తెలుస్తోంది. అయితే మెజారిటీ లేకపోయినా టీడీపీ తరఫున బరిలో నిలిచిన వర్ల రామయ్యకు ఆ పార్టీ నుంచి ఎంతమంది ఓటు వేశారన్న దానిపైనే ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.
అదే
సమయంలో
టీడీపీకి
రాజీనామా
ప్రకటించిన
ముగ్గురు
ఎమ్మెల్యేలు
కరణం
బలరాం,
వల్లభనేని
వంశీమోహన్,
మద్దాలి
గిరిధర్
చివరి
వరకూ
వేచి
చూసి
ఓటువేశారు.
జనసేన
ఎమ్మెల్యే
రాపాక
మాత్రం
తాను
వైసీపీ
అభ్యర్ధికి
ఓటు
వేసినట్లు
పోలింగ్
తర్వాత
వ్యాఖ్యానించారు.