ఆటోలో ఎక్కి మాటల్లో పెట్టారు: దిగాక చూసుకుంటే?, లబోదిబోమన్న మహిళ..
విశాఖపట్నం: ఓ మహిళను మాటల్లో పెట్టి.. ఆమె వద్ద నుంచి సుమారు రూ.10లక్షల విలువ చేసే ఆభరణాలతో పరారయ్యారు ఇద్దరు కి'లేడీ'లు. ప్రహ్లాదపురంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న క్రమంలోనే నగలు చోరీకి గురైనట్టు బాధితురాలు వెల్లడించారు.
పెళ్లికని వెళ్తే..:
పట్నాల కళావతి (52)-బాలవీరబ్రహ్మనంద దంపతులు హైదారాబాద్లోని లింగంపల్లిలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. ఇటీవల కళావతి సోదరి కుమారుడికి పెళ్లి నిశ్చయమవడంతో.. పెళ్లి కోసం ప్రహ్లాదపురం వెళ్లారు. పెళ్లికని వెళ్లిన ఆమెకు చోరీ రూపంలో ఊహించని షాక్ తగిలింది.
బంగారం లాకరులో పెట్టాలనుకుంది..:
ఈ నెల 3న పెళ్లి జరగ్గా.. వివాహానంతరం కళావతి కుటుంబ సభ్యులు హైదరాబాద్ వచ్చేశారు. కళావతి మాత్రం బాలాజీనగర్ లోని బంధువుల ఇంట్లోనే ఉండిపోయారు. వెంట తెచ్చుకున్న బంగారు ఆభరణాలను పట్టణంలోని ఆంధ్రాబ్యాంక్ లాకరులో భ్రదపరుచుకుని వెళ్దామనుకున్నారు.
కిలేడీల పనేనా?:
సోమవారం
మధ్యాహ్నాం
బంగారు
ఆభరణాలు
తీసుకుని
కళావతి
ఆంధ్రాబ్యాంక్
బయలుదేరారు.
ఆటోలో
వెళ్తున్న
క్రమంలో
మార్గమధ్యలో
మరో
ఇద్దరు
మహిళలు
కూడా
అందులో
ఎక్కారు.
కళావతిని మాటల్లో పెట్టిన ఆ ఇద్దరు ఆమెకు తెలియకుండా బంగారం చోరీ చేశారు. కళావతి ఆటో దిగాక చూసుకుంటే బంగారం కనిపించలేదు. ఆ ఇద్దరు మహిళలు మధ్యలోనే దిగిపోవడంతో వారి పైనే అనుమానం కలిగింది.
35తులాలు చోరీ..:
కళావతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గోపాలపట్నం బీఆర్టీఎస్ రహదారిలోని మేదరివీధి సమీపంలో ఆ ఇద్దరు ఆటో దిగారని, అప్పటివరకు ఎన్ఏడీ కొత్తరోడ్డు వరకు వస్తామన్నవారు కాస్త మధ్యలోనే దిగడంపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. 35తులాల బంగారం చోరీ అయినట్టు తెలిపారు. ప్రస్తుతం దీనిపై గోపాలపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.