జైట్లీ లాంటి దగుల్బాజీ, మోడీ దారుణమైన వ్యక్తి, చంద్రబాబుకు అంత భయం: ఉండవల్లి సంచలనం
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీలపై మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. పెద్ద నోట్లు చలామణిలో లేవని చెబుతూ 2019 ఎన్నికల కోసం రాజకీయ నాయకులు పెద్ద నోట్లను తమ వద్ద దాచుకున్నారన్నారు.
పవన్ కళ్యాణ్ 'మహాకుట్ర'-ఆపరేషన్ గరుడ: 'శివాజీతో పలికించి, బాబుగారూ! ఏం ఐడియా, సాబ్జీ'
అందుకే ఏటీఎంలలో డబ్బులు లేకుండా పోయాయని ఆరోపించారు. ఇన్నేళ్ల జీవిత కాలంలో బ్యాంకులలో డబ్బులు లేకుండా పోవడం ఇప్పుడే చూస్తున్నానని మండిపడ్డారు. ప్రధాని మోడీ చాలా దారుణమైన వ్యక్తి అన్నారు. గోద్రా అల్లర్లలో చనిపోయిన శవాలను మొత్తం రాష్ట్రమంతా తిప్పిన ఘనత మోడీది అన్నారు.
ఇలాంటి వ్యూహాల వెనుక ఉన్నది బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా అన్నారు. ఇప్పుడు ఏపీకి తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంటులో చర్చ జరగకపోతే రాష్ట్రం మరింత ఎక్కువగా నష్టపోతుందని చెప్పారు.
ప్రధాని మోడీ తనను చంపేస్తాడేమోనన్న భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు. అరుణ్ జైట్లీ లాంటి దగుల్బాజీ కేంద్ర ఆర్థిక మంత్రిని మనం ఎప్పుడూ చూడలేదని అభిప్రాయపడ్డారు. ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.