అనంతలో లారీ డ్రైవర్పై తుపాకీ కాల్పుల కలకలం, పరిస్థితి విషమం
హైదరాబాద్: అనంతపురం జిల్లా ధర్మవరం మండలం సీతారాంపల్లిలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. బుధవారం తెల్లవారుజామున బీజాపూర్ ప్రాంతానికి చెందిన ఓ లారీ డ్రైవర్ రమేష్పై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు.
దగ్గర నుంచి గురి చూసి కాల్చడంతో లారీ డ్రైవర్పై శరీరంలోకి మాడు బుల్లెట్లు దూసుకెళ్లాయి. బెంగుళూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కేఏ28సీ 3057 నెంబర్ లారీని సినీ ఫక్కీలో కారులో వెంబడించి నిందితులు కాల్పులకు తెగబడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటన్ లారీ డ్రైవర్ రమేశ్ను బెంగుళూరులోని సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులు దోపిడీ దొంగలు అయి ఉంటారని పోలీసుు భావిస్తున్నారు.
అంతేకాదు లారీ డ్రైవర్ సరుకును అన్లోడ్ చేసి డబ్బు తీసుకువెళుతున్నాడని గమనించిన దుండగులు ఈ ఘటనకు పాల్పడి వుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
పాతపట్నంలో పేలిన గ్యాస్ సిలిండర్
శ్రీకాకుళం జిల్లాలో బుధవారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. జిల్లాలోని పాతపట్నం మండలం గంగువాడలోని ఓ ఇంట్లో ఈ సిలిండర్ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు తెలిపారు. ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.