కేంద్ర బడ్జెట్: దీర్ఘకాలంలో చాలా ప్రయోజనాలు.. మోడీ, జైట్లీకి కృతజ్ఞతలన్న చంద్రబాబు
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. విజయవాడలో ఆయన బడ్జెట్ పై మీడియాతో మాట్లడారు.
విజయవాడ: ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. విజయవాడలో ఆయన బడ్జెట్ పై మీడియాతో మాట్లడారు.
దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలు కలిగించే అంశాలు బడ్జెట్ లో చాలా ఉన్నాయని అన్నారు. కేంద్రం రాజధాని ప్రాంత రైతులకు మూలధన లాభంలో పన్ను మినహాయింపు ఇవ్వడంపై చంద్రబాబు హర్షం వెలిబుచ్చారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కృతజ్ఞతలు తెలిపారు. ''డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కోసం కొన్ని సిఫార్సులు చేశాం. చెల్లింపుల బోర్డు ఏర్పాటు చేశారు. మౌలిక వసతులకు బడ్జెట్ లో ప్రధాన్యం ఇచ్చారు..'' అని ఆయన పేర్కొన్నారు.
అలాగే గృహ నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చారని, ఎస్సీ, మైనార్టీలు, మహిళలు, యువతకు ప్రధాన్యం లభించిందని అన్నారు. విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత రావాల్సి ఉందని చంద్రబాబు వివరించారు.