ఏపీకి ప్యాకేజీపై చర్చిందుకు సమయం లేకే: జైట్లీ, ఇప్పుడొద్దన్న మోడీ
కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రత్యేక ప్యాకేజీ అంశం బుధవారం నాడు చర్చకు రాలేదు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు.
హైదరాబాద్: కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రత్యేక ప్యాకేజీ అంశం బుధవారం నాడు చర్చకు రాలేదు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు.
సమయం లేనందువల్లే ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే అంశంపై చర్చ జరగలేదని చెప్పారు. వచ్చే సమావేశాల్లో ఈ అంశం పైన తాము చర్చిస్తామని జైట్లీ తెలిపారు.
ఎంగిలాకులు ఎత్తేవాడినా సంతోషం, యుద్ధ ట్యాంకులు వచ్చినా: పవన్ కళ్యాణ్ ఆవేశం
కాగా, ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమైంది. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే అంశం చర్చకు వస్తుందని భావించారు.
టేబుల్ ఐటమ్గా చేర్చేందుకు అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. అయితే సమయాభావం వల్ల తదుపరి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుందామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్టు తెలుస్తోంది.