కారు ప్రమాదంలో మృత్యువాత పడిన మంత్రి కుమారుడు...
ఉత్తరాఖండ్లో ఘొర రోడ్డు ప్రమాదం జరిగింది.. తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో ఉత్తరాఖండ్ మంత్రి కుమారుడితోపాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.. కాగా మరోకరికి తీవ్రగాయాలయ్యాయి...మంత్రి కుమారుడు ప్రయాణిస్తున్న కారు, ట్రక్కు ఢీకోట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.
బుధవారం తెల్లవారుజామున ఉత్తరాఖండ్ విద్యాశాఖ మంత్రి అరవింద్ పాండే కుమారుడైన అంకూర్ పాండేతోపాటు మరో ముగ్గురు గోరఖ్పూర్లోని పెళ్లికి హజరైందుకు వెళుతున్నారు....దీంతో తెల్లవారు జామున మూడు గంటల సమయంలో జాతీయ రహాదారి 24లో ప్రయాణిస్తున్న కారు బైరెల్లి జిల్లాలోని ఫరీద్పూర్ వద్దకు చేరుకోగానే ట్రక్కును ఢీకొట్టింది...దీంతో కారులో ఉన్న మంత్రి కుమారుడితోపాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.. కాగా మరోకరికి తీవ్రగాయలయ్యాయి.. కాగా అరవింద్ పాండే విద్యాశాఖ మంత్రితోపాటు భారతీయ జనతాపార్టీ లో కీలక నాయకుడిగా ఉన్నారు..