సత్యం రామలింగరాజు గ్రామంలో ఇంతదారుణమా?: బాబుపై వీహెచ్ ఫైర్
హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రు సాంఘిక బహిష్కరణ విషయంపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గరగపర్రు పరిస్థితులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంటనే చక్కదిద్దాలని డిమాండ్ చేశారు.
Recommended Video
లేదంటే కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీని తీసుకువచ్చి అక్కడి దళితులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని చెప్పారు. సాఫ్ట్వేర్ రంగంలో ఎంతో పేరుగాంచిన సత్యం రామలింగరాజు సొంత గ్రామంలోనే దళితులను వెలివేయడం దారుణమని అన్నారు.
బాబు, లోకేష్ బాటలో జగన్: రచ్చ చేస్తున్న టీడీపీ(వీడియో)
ఇంత అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తోందని వీహెచ్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటెలిజెన్స్ విభాగం పనిచేస్తుందా? చంద్రబాబు భజన చేస్తోందా? అని విమర్శించారు.
తాను గరగపర్రు వెళ్లి దళితులతో మాట్లాడానని, వారికి కనీసం తిండి లేక నానా అవస్థలు పడుతున్నారని వీహెచ్ తెలిపారు. తన సొంత ఖర్చులతో ఇవాళ బియ్యం తదితర నిత్యావసర వస్తువులను పంపుతున్నట్లు వీ హనుమంతరావు తెలిపారు.