విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీతారామాంజనేయులు నుండి హానీ: డిజిపికి వల్లభనేని

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vallabhaneni Vamsi
హైదరాబాద్/విజయవాడ: సీతారామాంజనేయులు నుండి తనకు ప్రాణహానీ ఉందని, రక్షణ కల్పించాలని తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా సీనియర్ నేత వల్లభనేని వంశీ సోమవారం డిజిపి ప్రసాద రావును కలిసి ఫిర్యాదు చేశారు. ఒకప్పటి విజయవాడ పోలీసు కమిషనర్ సీతారామాంజనేయులు నుంచి తనకు ముప్పు పొంచి ఉందని వంశీ డిజిపి దృష్టికి తీసుకు వచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా కలిసి ఫిర్యాదు చేయనున్నారు. పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లనున్నారు.

ఓ డైరెక్టర్ ఇచ్చిన సమాచారంతో వంశీ అప్రమత్తమై ప్రస్తుత పోలీసు కమిషనర్ శ్రీనివాసులను కలిశారట. ఆయన సూచనలతో వంశీ సోమవారం సాయంత్రం డిజిపిని కలిశారు. సీతారామాంజనేయులుతో తనకు గల వివాదాన్ని వంశీ డిజిపికి వివరించినట్లుగా తెలుస్తోంది.

గతంలో ఓ మహిళ విషయంలో వల్లభనేని వంశీ, సీతారామాంజనేయులు మధ్య వివాదం వచ్చింది. దాంతో తన పైన కక్ష పెట్టుకున్న సీతారామాంజనేయులు తన సంగతి తేలుస్తానని హెచ్చరిస్తున్నారని వంశీ చెప్పినట్లుగా తెలుస్తోంది.

కాగా, విజయవాడలో అన్నపూర్ణ ప్యాకేజీస్ సంస్థకు సంబంధించిన వివాదంలో వారి మధ్య వివాదం ప్రారంభమైంది. ఆ తర్వాత సీతారామాంజనేయులు విజయవాడలోని ఓ మహిళను లైంగికంగా వేధింపులకు గురి చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో ఇరువురి మధ్య వివాదం ముదిరిందంటారు.

మరోవైపు వల్లభనేని వంశీ డిజిపికి ఫిర్యాదు చేసిన విషయం తనకు తెలియదని సీతారామాంజనేయులు చెబుతున్నారు.

English summary
Telugudesam Party senior leader Vallabhaneni Vamsi on Monday met DGP Prasad Rao and seek protection for him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X