అడుగు భాగాన నోరు, చుట్టూ ముల్లు: గుంటూరులో వింత ఆకారంలో చేప
గుంటూరు జిల్లా పెదకూరపాడులో వింత చేప కనిపించింది. గ్రామానికి చెందిన రెహ్మాన్ పొలంలోని వ్యవసాయ బావిలో ఆదివారం సాయంత్రం వింత చేప కనిపించింది.
గుంటూరు: గుంటూరు జిల్లా పెదకూరపాడులో వింత చేప కనిపించింది. గ్రామానికి చెందిన రెహ్మాన్ పొలంలోని వ్యవసాయ బావిలో ఆదివారం సాయంత్రం వింత చేప కనిపించింది. ఇది చాలా వింతగా ఉండటంతో ప్రజలు ఆసక్తిగా చూశారు.
ఆదివారం సాయంత్రం రెహ్మాన్ తన వ్యవసాయ బావికి నీరు పెట్టాడు. బావిలో నీరు అయిపోయింది. అతడు బావిలోకి దిగారు. లోపల చేపలను గుర్తించాడు. వాటిని గట్టున పడేశాడు. అయితే, గట్టున పడిన చేపలలో ఒకటి భిన్నంగా, వింతగా కనిపించింది.
చేప అడుగు భాగాన నోరు ఉంది. చేపలకు సాధారణంగా ముందు భాగంలో నోరు ఉంటుంది. చేప పైభాగన కాక చేప చుట్టూ ముల్లు వలె ఉన్నాయి. మిగతా చేపలు ఒడ్డున పడేసిన కాసేపటికి చనిపోతాయి. కానీ ఈ చేప మాత్రం దాదాపు నాలుగు గంటల పాటు బతికి ఉంది.
Comments
English summary
Variety fish found in Guntur district on Sunday evening.