ఢిల్లీకెందుకెళ్లారు: జగన్కు వర్ల, సభతో సమస్య: జగ్గారెడ్డి
ఓ ఖైదీ బెయిల్ పైన విడుదలైతే జగన్నాథ రథయాత్రతో పోల్చడం హిందూ మతాన్ని కించపర్చడమేనన్నారు. హిందూ మతంపై విశ్వాసం లేనంత మాత్రాన హైందవులను కించపర్చేలా రాయడం తగదని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసు పార్టీ అధిష్టానం సూచల మేరకే నడుచుకుంటోందన్నారు.
జగ్గా రెడ్డి ఫైర్
వైయస్ జగన్ హైదరాబాదులో సమైక్య సభ పెట్టి శాంతిభద్రతల సమస్యను సృష్టించాలని చూస్తున్నారని సంగారెడ్డి శాసన సభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికే ప్రజల్లో ప్రాంతీయ విభేదాలు పెరిగాయని, జగన్ సభతో మరింత పెరగవచ్చునన్నారు.
తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ యు టర్న్ తీసుకుందని ఆరోపించారు. మొదటి నుండి ఆ పార్టీ నేతలు సమైక్యవాదులే అన్నారు. కేంద్రం నిర్ణయానికి కట్టుబడతామని అందరూ లేఖలు ఇచ్చాకనే సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకుందన్నారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి ఇప్పుడు యూ టర్న్ తీసుకోవడమేమిటని, హైదరాబాదులో జగన్ సభ పెట్టడం సరికాదన్నారు.