వివేకా హత్యకేసుపై వర్ల సంచలనం .. జగన్ ను విచారిస్తే అన్నీ బయటకు వస్తాయి
వైసీపీ నేత వివేకానంద రెడ్డి హత్య కేసు పై టీడీపీ నేత వర్ల రామయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఈ కేసులో విచారించాలని టీడీపీ నేత వర్లరామయ్య డిమాండ్ చేశారు. జగన్ బాబాయి వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.
ఏంటి ఈ న్యూసెన్స్..! నవ్వులపాలు చేయకండి..! ఆపండి..! వైసీపి ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్..!!
ఇక ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది . అసలు వైఎస్ వివేకా హత్య కేసు వ్యవహారం ఇప్పటి వరకు తేలనేలేదు. సిట్ దర్యాప్తు నత్తనడకన సాగటం వెనుక కారణాలపై కూడా వర్ల అనుమానం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఈ కేసు గురించి టీడీపీ నేత వర్ల రామయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసును కోల్డ్ స్టోరేజ్లో పెట్టి.. ఇంటి దొంగలను వదిలిపెట్టారన్నారు. ఇక ఎవరి ఆదేశాలతో ఇంటి దొంగలను అరెస్ట్ చేయలేదో సిట్ చెప్పాలని డిమాండ్ చేశారు.ఎంపీ అవినాష్రెడ్డి కాల్ డేటా ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు వర్ల రామయ్య .
తండ్రిని ఎవరు చంపారో వివేకా కూతురికి తెలుసునని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఆపాలని సిట్కు హైకోర్టు చెప్పలేదని పేర్కొన్నారు. ఇంటి దొంగల పనే అని స్పష్టంగా అర్ధం అవుతుందన్న వర్ల జగన్ ను విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని తెలిపారు.