వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాస్తు భయంతో... రూట్ మార్చిన చంద్రబాబు, ఇప్పుడంతా రివర్స్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మళ్లీ వాస్తు భయం పట్టుకుంది. దీంతో ఆయన ఏపీ సచివాలయంలో తన రూట్‌ మార్చారు. గేట్‌ నంబర్‌ 1 నుంచి కాకుండా గేట్‌ నంబర్‌ 2 నుంచి చంద్రబాబు నాయుడు సచివాలయంలోకి వెళుతున్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మళ్లీ వాస్తు భయం పట్టుకుంది. దీంతో ఆయన ఏపీ సచివాలయంలో తన రూట్‌ మార్చారు. గేట్‌ నంబర్‌ 1 నుంచి కాకుండా గేట్‌ నంబర్‌ 2 నుంచి చంద్రబాబు నాయుడు సచివాలయంలోకి వెళుతున్నారు.

వాస్తు కారణాలతోనే సీఎం రూట్‌ మార్చినట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో ఓటుకు కోట్లు కేసుతో చిక్కుల్లో పడిన సమయంలోనూ చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి వాస్తుపై దృష్టి కేంద్రీకరించారు.

chandrababu

అందులో భాగంగా ఆయన తన రాకపోకల దారి మార్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ ఇంట్లో నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు కుడివైపు తిరిగేవారు. ఇప్పుడు ఎడమ వైపునకు తిరిగి రాకపోకలు సాగిస్తున్నారు.

అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయమైన ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన్ లో కూడా వాస్తు ప్రకారం అనేక మార్పులు చేర్పులు చేయించారు.

English summary
Due to Vastu fear, CM Chandrababu Naidu changed his root in AP Secretariat and residence as well. Now CM Chandrababu Naidu enters AP Secretariat in 2nd Gate instead of 1st Gate due to Vaastu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X