పరిటాల శ్రీరామ్కు వెంకయ్య నాయుడు ఫోన్, కృతజ్ఞతలు
మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
అనంతపురం: మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
శ్రీరామ్కు వెంకయ్య ఫోన్
ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్కు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు శ్రీరామ్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం జిల్లా వెంకటాపురంలో పరిటాల శ్రీరామ్ వివాహం జ్ఞానవితో వివాహం జరిగింది.
రామ్మోహన్ నాయుడు హాజరు
పరిటాల శ్రీరామ్ పెళ్లికి యువ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ పెళ్లికి హాజరై, వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
కేసీఆర్కు ఘన స్వాగతం
పరిటాల శ్రీరామ్ తనయుడు వివాహానికి హాజరైన కెసిఆర్కు అధికారులు ఘన స్వాగతం పలికారు. తొలుత పరిటాల ఘాట్ను సందర్శించారు. పరిటాల రవీంద్రకు నివాళులు అర్పించారు. అనంతరం
కెసిఆర్, పరిటాల రవిల మధ్య స్నేహం
పరిటాల శ్రీరామ్ తండ్రి పరిటాల రవీంద్ర, తెలంగాణ సిఎం కెసిఆర్లు గతంలో సమైక్య ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సమయంలో కలిసి పని చేశారు. పరిటాల రవి, కెసిఆర్ల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఓ సమయంలో కెసిఆర్ అనంతపురం ఇంచార్జిగా ఉన్నారు.