Video:లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు : నీవు..మగాడివైతే సీబీఐ వేయరా : రాజారెడ్డి..వైఎస్సార్ గతి ఏమైందో తెలుసుగా జగన్..!
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ నేతలు..ముఖ్యమంత్రి పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కర్నూలు జిల్లాలో హత్యకు గురైన గడివేముల మండలం, పెసరవాయి గ్రామం టీడీపీ నేతలు ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర రెడ్డిల కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైసీపీ నేతలు ఇప్పటి వరకు 27 మంది టీడీపీ నేతలను అతి దారుణంగా చంపారన్నారు. చేతకాని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ఎదురుదాడి చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు.ఇద్దరు నాయకులు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములను హత్య చేయడం దారుణమన్నారు.
కుక్క..వేయరా అంటూ తీవ్ర వ్యాఖ్యలు..
"ఇక్కడ ఒక కుక్క ఉంది..బాగా మొరుగుతోంది. నీకు దమ్ముంటే సీబీఐ విచారణకు వేయి. సొంత చిన్నాన్నను చంపిన వాడు ఎవరో తెలియని పరిస్థితుల్లో ఉంది ఆంధ్ర రాష్ట్రం. వేయ్ సీబీఐ విచారణ వేయి. నీవు..మగాడివైతే వేయ్ రా సీబీఐ ఎంక్వైరీ వేయరా" అంటూ మాట్లాడారు. "అంతే కానీ, మా కార్యకర్తలను ఇంత దారుణంగా చంపుతారా.అయ్యా జగన్ రెడ్డి గుర్తుపుట్టుకో. అందరి కంటే నీకే బాగా తెలుసు. కత్తితో రాజకీయాలు చేసే వారు చివరకు కత్తితోనే చస్తారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మా చంద్రబాబు చిటిక వేస్తే నీవు తిరిగే పరిస్థితి ఉండేదా..పాదయాత్ర చేసే పరిస్థితి ఉండేదా" అంటూ ప్రశ్నించారు.
లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు : నీవు..మగాడివైతే సీబీఐ వేయరా....
— oneindiatelugu (@oneindiatelugu) June 18, 2021
#Naralokesh #CBI #YSJagan #Andhrapradesh #OneIndiaTelugu pic.twitter.com/eJr5aUetSS
కత్తితోనే అంతం అవుతారు..
Recommended Video
"రాజా రెడ్డి, వైఎస్సార్ కూడా టీడీపీ శ్రేణులు చంపించారు. చివరికి వాళ్ళ గతి ఏమైందో జగన్ తెలుసుకోవాలి." అని మండిపడ్డారు.." వీటిని వ్యక్తిగతంగా తీసుకుంటా....వడ్డీతో సహా చెల్లిస్తా" అని హెచ్చరించారు. నాగేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి కుటుంబాలకు అండగా ఉంటామని వారిని ఆదుకుంటామని లోకేష్ భరోసా ఇచ్చారు. టీడీపీ విమర్శల పైన ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి సైతం స్పందించారు. రాజకీయాల కోసం హత్యలు చేయాల్సిన అవసరం లేదన్నారు. తనకు ఈ హత్యలతో సంబంధం ఉందని తేల్చితే..తాను రాజకీయాల నుండి విరమించుకుంటానంటూ సవాల్ చేసారు.