వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మానాన్నకు పుడితే అంటావా, పచ్చకామెర్లు ఉంటే: విజయసాయిపై కొణకళ్ల, మురళీ మోహన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు మురళీ మోహన్, కొణకళ్ల నారాయణలు మంగళవారం నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబుపై, తమ పార్టీ ఎంపీ సుజనా చౌదరి సహా పలువురిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు.

ఎంపీ కొణకళ్ల నారాయణ మాట్లాడుతూ.. విజయసాయి రెడ్డి రాజకీయాలను దిగజార్చేలా మాట్లాడారన్నారు. చంద్రబాబు చాలా సీనియర్ నాయకులు అన్నారు. గజదొంగ అని, ఛార్లెస్ శోభరాజ్ అని, అమ్మానాన్నకు పుడితే అని వ్యాఖ్యానించడం చాలా బాధాకరం అన్నారు. తాము హోదా కోసం ఉద్యమిస్తున్నామని, వైసీపీ కపట నాటకాలు ఆడుతోందన్నారు. సంస్కారహీనమైన భాష మాట్లాడారన్నారు.

చంద్రబాబూ! మాల్యాతో పోలుస్తావా, అమ్మానాన్నకు పుడితే: విజయసాయి సంచలన వ్యాఖ్యలుచంద్రబాబూ! మాల్యాతో పోలుస్తావా, అమ్మానాన్నకు పుడితే: విజయసాయి సంచలన వ్యాఖ్యలు

Vijaya Sai Reddy words are not acceptable, says Murali Mohan

మురళీ మోహన్ మాట్లాడుతూ.. పచ్చకామెర్లు ఉన్న వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తోందన్నారు. ఆర్థిక నేరాల్లో ఏ1, ఏ2లుగా ఉన్న వారు ఏదో మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు అహర్నిషలు రాష్ట్రం కోసం కష్టపడుతున్నారని చెప్పారు. అలాంటి చంద్రబాబుకు చేతనైతే సహకరించాలని, అంతేకానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దన్నారు.

ఆర్థిక నేరాలు చేసే వారు మాట్లాడటం తప్పని చెప్పారు. పేడ ఉంటే మనం పక్కకు తప్పుకొని వెళ్తాం తప్పితే, తొక్కమని మురళీ మోహన్ అన్నారు. తాము కూడా అలాగే ఉంటున్నామన్నారు. విజయ సాయి రెడ్డి కూడా చదువుకున్న వ్యక్తి అని, అలాగే వ్యవహరించాలన్నారు. అప్పు చేసి పారిపోయే వాళ్లు ఆర్థిక నేరస్తులు అవుతారని, అప్పు చేసిన వారు కాదన్నారు.

English summary
Telugudesam MP Murali Mohan on Tuesday said that YSRCP MP Vijaya Sai Reddy's words are not acceptable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X