వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళల భద్రతపై చంద్రబాబు మాటలు .. దెయ్యాలు వేదాలు వల్లించినట్టే : విజయసాయి ఫైర్

|
Google Oneindia TeluguNews

చంద్రబాబు మీద నిత్యం విరుచుకు పడే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా మహిళల భద్రతపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. మహిళల భద్రత గురించి చంద్రబాబుకు మాట్లాడే హక్కు లేదని విజయసాయి సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు . మహిళల భద్రతపై చంద్రబాబు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.

కనకదుర్గ ఫ్లైఓవర్ క్రెడిట్ మాదే .. కేశినేని నానీ, విజయసాయిలతో పాటు పోటీలో బీజేపీ నేతలు కూడాకనకదుర్గ ఫ్లైఓవర్ క్రెడిట్ మాదే .. కేశినేని నానీ, విజయసాయిలతో పాటు పోటీలో బీజేపీ నేతలు కూడా

ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయిరెడ్డి గతంలో చంద్రబాబు హయాంలో మహిళలపై జరిగిన దాడులను గురించి ప్రస్తావించారు.

 vijayasai reddy fires on Chandrababus words on the women safety

మహిళల భద్రత గురించి మాట్లాడుతున్న చంద్రబాబు తాసిల్దార్ వనజాక్షిపై చింతమనేని దాడి చేస్తే ఆమెదే తప్పంటూ రౌడీని వెనకేసుకొచ్చిన వారెవరు అంటూ ప్రశ్నించారు. అంతేకాదు బీటెక్ విద్యార్థిని రిషితేశ్వరి ప్రాణాలు తీసిన వారిని కాపాడింది మీరు కాదా ? అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఏపీలో తాజాగా మహిళలపై, బాలికలపై దాడులు పెరిగాయి. ప్రేమను నిరాకరించారని ప్రేమోన్మాదుల దాడులు, బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో పాటు టీడీపీ నేతలు మహిళలకు రక్షణ కల్పించటంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని విమర్శలు గుప్పిస్తున్నారు.

Recommended Video

#APJAbdulKalam: India's Missile Man Birth Anniversary, Facts | India Miss'ing'ile Man!!

మహిళల రక్షణ కోసం దిశ వంటి చట్టాలు తీసుకువచ్చినా ఈ పరిస్థితిలో మార్పు రావడం లేదని, ఇప్పటివరకు దిశ చట్టం ద్వారా ఏం చేశారు అంటూ ప్రశ్నించిన విషయం తెలిసిందే. మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో చంద్రబాబు హయాంలో మహిళలకు ఏపాటి రక్షించారో చెప్పాలంటూ విజయ సాయి రెడ్డి చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.

English summary
Vijayasaireddy, a Rajya Sabha member of the YSR Congress party is always angry with Chandrababu, was incensed over Chandrababu's latest remarks on women's safety. Vijayasai broke into the social media platform that Chandrababu has no right to speak about the safety of women. Vijaya Sai Reddy said that Chandrababu's talk on women's safety was like Vedas says by demons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X