హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీధీరౌడీల్లా: రాములమ్మ, చీకటి పనులు చేయం:శ్రీకాంత్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Vijayasanthi fires at Seemandhra leaders
హైదరాబాద్/మెదక్: సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు వీధి రౌడీల్లా ప్రవర్తించాలని మెదక్ జిల్లా పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి మండిపడ్డారు. ఆమె మెదక్ జిల్లాలోని నంగునూరులో గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను చింపి రాద్దాంతం చేయడం సరికాదన్నారు. వారు తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణ ఆగబోదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని, కొత్త సంవత్సరంలో రాష్ట్ర ఏర్పాటు ఖాయమన్నారు.

చీకటి పనులు అలవాటు లేదు: శ్రీకాంత్ రెడ్డి

తమకు చీకటి పనులు చేసే అలవాటు లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం అన్నారు. సీమాంధ్ర టిడిపి నేత పయ్యావుల కేశవ్ అంతకుముందు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నిప్పులు చెరిగారు. దీనిపై శ్రీకాంత్ రెడ్డి స్పందించారు.

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి అమ్ముడుపోయి టిడిపి తమపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. టిడిపి పేరు బదులు వన్ బై టు అని పెట్టుకుంటే మంచిదన్నారు. టిడిపితో పొత్తు అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు సైతం భయపడుతున్నారన్నారు.

తమకు టిడిపిలా చీకటి పనులు చేసే అలవాటు లేదన్నారు. పయ్యావులకు దమ్ముంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాలర్ పట్టుకొని సమైక్యం కోసం లేఖ రాయించాలన్నారు. టిడిపి సమైక్యమో, విభజననో చెప్పలేని పరిస్థితిలో ఉందన్నారు. ఆ పార్టీకి ఓ విధానమంటూ లేదన్నారు.

English summary
Medak district MP Vijayasanthi on Thursday fired at Seemandhra leaders for tearing the Telangana Draft Bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X