ఫేస్ బుక్ లో యువతి పరిచయం, మత్తుమందిచ్చి గ్యాంగ్ రేప్
ఫేస్ బుక్ లో పరిచయమైప యువతిని తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు శ్రీకాంతో అనే యువకుడు. నిందితులపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది.
విజయవాడ:ఫేస్ బుక్ లో పరిచయమైప యువతిని తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు శ్రీకాంతో అనే యువకుడు. నిందితులపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
కృష్ణా జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే యువకుడికి ఫేస్ బుక్ లో ఓ యువతితో పరిచయమైంది. వీరిద్దరూ కొద్దిరోజులుగా సన్నిహితంగా ఉంటున్నారు. ఆ యువతి బిటెక్ చదువుతోంది. అయితే ఈ నెల 16వ, తేదిన రాత్రి బీఆర్ టీఎస్ రోడ్డులో శ్రీకాంత్ అతని స్నేహితులు మాయమాటలు చెప్పి యువతిని తీసుకెళ్ళారు.
కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి బాధితురాలిపై అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన తర్వాత బాధితురాలిని నడిరోడ్డుపై వదిలేసి వెళ్ళారని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన తర్వా బాధితురాలు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులు శ్రీకాంత్, అభిషేక్, పవన్ , సునీల్, అఖిల్ లను పోలీసులు అరెస్టు చేశారు.